మత విద్వేషాల పేరుతో సీఎం కుట్ర

ABN , First Publish Date - 2020-11-28T08:01:44+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గించేందుకు మత విద్వేషాల పేరుతో సీఎం కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని బీజేపీ రాష్ట్ర

మత విద్వేషాల పేరుతో సీఎం కుట్ర

పాతబస్తీలో పాకిస్థాన్‌, రోహింగ్యాల స్థావరాలు

మేం గెలిస్తే సర్జికల్‌ స్టైక్స్‌ చేసి తరిమేస్తాం: సంజయ్‌

సైదాబాద్‌/చాదర్‌ఘాట్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గించేందుకు మత విద్వేషాల పేరుతో సీఎం కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. కుర్మగూడ, సైదాబాద్‌, ఐఎ్‌ససదన్‌, అక్బర్‌బాగ్‌ డివిజన్లలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. సీఎం రాసిచ్చిన స్ర్కిప్ట్‌ను డీజీపీ చదివి వినిపించారని ఆరోపించారు.


ప్రభుత్వానికి సమాచారం ఉంటే కుట్రదారులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, రోహింగ్యాలకు పాతబస్తీలో స్థావరాలున్నాయని, బీజేపీకి అధికారమిస్తే వాళ్లను తరిమివేస్తామని స్పష్టం చేశారు. ఇండియా గెలవొద్దని కోరుకునే వారిపై సర్జికల్‌ స్టైక్స్‌ చేస్తామని వెల్లడించారు.  


Updated Date - 2020-11-28T08:01:44+05:30 IST