కాకర్ల మృతికి కేసీఆర్ సంతాపం
ABN , First Publish Date - 2021-04-16T21:26:09+05:30 IST
నిమ్స్ మాజీ డైరెక్టర్, ప్రముఖ వైద్యులు పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు
హైదరాబాద్: నిమ్స్ మాజీ డైరెక్టర్, ప్రముఖ వైద్యులు పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో వైద్య రంగానికి కాకర్ల చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. నిమ్స్ డైరెక్టర్గా ఆయన చేసిన కృషి గొప్పదన్నారు. కాకర్ల కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాడ సానుభూతిని తెలిపారు.