సతీమణికి చీర కొన్న ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2022-04-10T17:10:58+05:30 IST

బెంగళూరులోని బసవనగుడి నేషనల్‌ కళాశాల ఆవరణలో జరుగుతున్న సరస్‌ మేళాను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తన

సతీమణికి చీర కొన్న ముఖ్యమంత్రి

బెంగళూరు: బెంగళూరులోని బసవనగుడి నేషనల్‌ కళాశాల ఆవరణలో జరుగుతున్న సరస్‌ మేళాను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి కోసం రూ.2500 చెల్లించి చీర కొనుగోలు చేశారు. పది రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి స్వసహాయ గ్రూపులు తాము తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రులు డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ, శంకరపాటిల్‌ మునేనకొప్ప, ఎంటీబీ నాగరాజ్‌, స్థానిక ఎమ్మెల్యే రవిసుబ్రమణ్య తదితరులు పాల్గొన్నారు. కాగా ఇదే సందర్భంగా స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వదేశీ మేళాను సీఎం పరిశీలించారు. రూ. 3వేలతో ఒక శాలువాను కొనుగోలు చేశారు. అదమ్యచేతన సంస్థ అధినేత్రి తేజస్విని అనంతకుమార్‌ కూడా పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-10T17:10:58+05:30 IST