ఢిల్లీలో సీఎం బిజీ బిజీ
ABN , First Publish Date - 2022-02-08T18:25:40+05:30 IST
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాష్ట్రానికి చెందిన ఎంపీలతోనూ, పలువురు కేంద్రమంత్రులతోనూ విస్తృతంగా చర్చలు జరిపారు. కేంద్ర బడ్జెట్పై, త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్పైనా ఎంపీల
- ఎంపీలతో, కేంద్రమంత్రులతోనూ విస్తృత చర్చలు
బెంగళూరు: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాష్ట్రానికి చెందిన ఎంపీలతోనూ, పలువురు కేంద్రమంత్రులతోనూ విస్తృతంగా చర్చలు జరిపారు. కేంద్ర బడ్జెట్పై, త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్పైనా ఎంపీల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి తొలుత కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతోనూ, కేంద్ర ఇంధన శాఖా మంత్రి ఆర్కే సింగ్తోనూ, రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి మన్సుఖ్ మాండ వీయాతోనూ సమావేశమయ్యారు.