Chhattisgarh : అది నేర్చుకోవడానికే మా దగ్గరకు బీజేపీ వస్తోంది : సీఎం భూపేష్

ABN , First Publish Date - 2022-09-10T18:58:15+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నమూనాను

Chhattisgarh : అది నేర్చుకోవడానికే మా దగ్గరకు బీజేపీ వస్తోంది : సీఎం భూపేష్

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నమూనాను అధ్యయనం చేయడం కోసం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా (JP Nadda) రాష్ట్రానికి వస్తున్నారని ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ (Bhupesh Baghel) అన్నారు. తన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చూసి, కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి పథకాలను చేపడుతోందన్నారు. 


భూపేష్ బాఘేల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఛత్తీస్‌గఢ్ అమలు చేస్తున్న అభివృద్ధి నమూనాను చూసి, అధ్యయనం చేయడం కోసం బీజేపీ వస్తోందన్నారు. బీజేపీ ఒంటరిగా పోరాడదని, ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి న్యూఢిల్లీలో అగ్గిపెట్టె వంటి సచివాలయాన్ని నిర్మించారని, గాలి వీచిన ప్రతిసారీ దాని కిటికీలు పెద్ద చప్పుడు చేస్తాయని ఆరోపించారు. 


బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. ఓ సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అన్నాచెల్లెళ్ళ పార్టీ అని ఎద్దేవా చేశారు. వంశపారంపర్య పాలనకు బీజేపీ వ్యతిరేకమని తెలిపారు. 


Updated Date - 2022-09-10T18:58:15+05:30 IST