Cmతో మైసూరు రాజమాత భేటీ
ABN , First Publish Date - 2022-07-12T16:33:56+05:30 IST
మైసూరు రాజమాత ప్రమోదాదేవి ఒడయార్ సోమవారం బెంగళూరులో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ
బెంగళూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మైసూరు రాజమాత ప్రమోదాదేవి ఒడయార్ సోమవారం బెంగళూరులో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రమోదాదేవిని సీఎం ఘనంగా సన్మానించారు. సీఎంతో ఆమె దాదాపు అరగంటకు పైగా చర్చ జరప డం రాజకీయంగా తీవ్ర కుతూహలం రేకెత్తిస్తోంది. మైసూరు జిల్లా నుంచి రాజకుటుంబీకులలో ఒకరికి లోక్సభ టికెట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తున్న తరుణంలో ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. మైసూరు యువరాజు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చేందుకు పెద్దగా ఆసక్తిచూపకపోవడంతో తాజాగా ఇందుకు రాజమాతను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.