ఢిల్లీలోనే ముఖ్యమంత్రి మకాం

ABN , First Publish Date - 2022-05-11T16:43:22+05:30 IST

ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై బుధవారం కూడా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రిమండలి సమావేశాన్ని ఈనెల 12కు వాయిదా వేసినట్టు ముఖ్యమంత్రి

ఢిల్లీలోనే ముఖ్యమంత్రి మకాం

                            - మంత్రిమండలి సమావేశం వాయిదా


బెంగళూరు: ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై బుధవారం కూడా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రిమండలి సమావేశాన్ని ఈనెల 12కు వాయిదా వేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. బీజేపీ అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపేందుకు వీలుగా సీఎం ఢిల్లీలోనే ఉన్నారు. కాగా బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఢిల్లీ నుంచే సూచనలు చేశారు. ఎలాంటి ఎన్నికలకైనా తమ పార్టీ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. అంతకు ముందు సీఎం ఢిల్లీలో మంగళవారం ఇన్వెస్ట్‌ కర్ణాటక 2022కు సంబంధించి వివిధ దేశాల రాయబారులతో చర్చలు జరిపారు. నవంబరులో జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొనాలని ఈ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. భారీ పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రవికుమార్‌ ప్రముఖులు పాల్గొన్నారు. 

Read more