ఢిల్లీలో సీఎం బిజీబిజీ

ABN , First Publish Date - 2022-04-07T16:52:19+05:30 IST

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై బుధవారం బిజీబీజీగా గడిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్రమంత్రులతో చర్చలు జరిపారు. బీజేపీ సంస్థాపనా

ఢిల్లీలో సీఎం బిజీబిజీ

                        - పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు 


బెంగళూరు: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై బుధవారం బిజీబీజీగా గడిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్రమంత్రులతో చర్చలు జరిపారు. బీజేపీ సంస్థాపనా దినోత్సవంలో భాగంగా ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పక్కనే ఆసీనుడై ప్రధాని మోదీ వర్చువల్‌ ప్రసంగాన్ని ఆలకించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ విడివిడిగా సమావేశమై చర్చలు జరిపారు. కేంద్రమంత్రులకు ఆయన పలువురు ప్రముఖుల పుస్తకాలను, ఆధ్యాత్మిక పుస్తకాలను జ్ఞాపికగా అందజేయడం విశేషం. సీఎంతో పాటు ఈ సమావేశాల్లో మంత్రులు గోవిందకార్జోళ, సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-04-07T16:52:19+05:30 IST