ప్రతి విద్యార్థిని ఓ ఓబవ్వ కావాలి: CM
ABN , First Publish Date - 2022-02-07T18:00:11+05:30 IST
చిత్రదుర్గలోని కోటను చుట్టుముట్టిన హైదరాలీ సేనలను రోకలితో చావబాదుతూ ధీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన ధీర వనిత ఒనకె ఓబవ్వ స్ఫూర్తితో ప్రతి విద్యార్థిని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిచుకోవాలని
బెంగళూరు: చిత్రదుర్గలోని కోటను చుట్టుముట్టిన హైదరాలీ సేనలను రోకలితో చావబాదుతూ ధీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన ధీర వనిత ఒనకె ఓబవ్వ స్ఫూర్తితో ప్రతి విద్యార్థిని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిచుకోవాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పిలుపునిచ్చారు. లైంగిక వేధింపులు, ఇతరిత్రా దాడుల నుంచి సురక్షితంగా తప్పించుకునేందుకు రాష్ట్రంలో 50 వేల మంది విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఇందులో భాగంగా విద్యాశాఖ, హోం శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ పరస్పరం సమన్వయంతో పనిచేస్తాయని సీఎం వెల్లడించారు.