‘‘క్షమించండి.. మరిచిపోండి... మళ్లీ ట్వీట్ చేసిన సీఎం గెహ్లోత్

ABN , First Publish Date - 2020-08-13T20:40:50+05:30 IST

‘‘క్షమించండి - మరిచిపోండి’’ అన్న సూత్రాన్ని ముఖ్యమంత్రి గెహ్లోత్ మళ్లీ ఎత్తుకున్నారు.

‘‘క్షమించండి.. మరిచిపోండి... మళ్లీ ట్వీట్ చేసిన సీఎం గెహ్లోత్

జైపూర్ :‘‘క్షమించండి - మరిచిపోండి’’ అన్న సూత్రాన్ని ముఖ్యమంత్రి గెహ్లోత్ మళ్లీ ఎత్తుకున్నారు. పరుష వ్యాఖ్యలతో సచిన్ పైలట్ బృందంపై విరుచుకుపడ్డ ఆయన... సయోధ్య కుదిరిన తర్వాత మొదటి సారిగా ఈ మంత్రాన్ని ఎత్తుకున్నారు. సరిగ్గా... అసెంబ్లీ సమావేశానికి ఒక్క రోజు ముందు మళ్లీ ఇదే మంత్రాన్ని ఎత్తుకున్నారు.


‘‘సోనియా, రాహుల్ నేతృత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే కాంగ్రెస్ ఆరాటమంతా. మన పార్టీలో నెల రోజులుగా అంతర్గత విభేదాలు కొనసాగాయి. అయితే... రాష్ట్రం కోసం, దేశం కోసం, రాజస్థాన్ ప్రజల కోసం వాటిని మరిచిపోయి.. క్షమించే స్ఫూర్తితో ముందుకు సాగాలి’’ అని గురువారం గెహ్లోత్ ట్వీట్ చేశారు.


మరోవైపు... సీఎం గెహ్లోత్... యువనేత పైలట్ ఇద్దరూ  గురువారం భేటీ అవుతున్నారని మొదట్లో ప్రకటించారు. అయితే.. ఇది శుక్రవారం జరిగే సూచనలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు సంకేతాలిచ్చారు. అసెంబ్లీ సమావేశం సందర్భంగా వీరిద్దరూ కలుసుకోనున్నారని తెలిపారు. 

Updated Date - 2020-08-13T20:40:50+05:30 IST