వేదికపైనే Siddu కి పంచ్ ఇచ్చిన CM అమరీందర్

ABN , First Publish Date - 2021-07-23T22:01:45+05:30 IST

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా సిద్దూ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కెప్టెన్ అమరీందర్

వేదికపైనే Siddu కి పంచ్ ఇచ్చిన CM అమరీందర్

న్యూఢిల్లీ : పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా సిద్దూ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా హాజరయ్యారు. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్యా విభేదాలు కొనసాగుతున్న విషయం విదితమే. అధిష్ఠానం సిద్దూను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తుందని వార్తలు వచ్చినప్పటి నుంచే సీఎంతో సహా ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అధిష్ఠానం రంగంలోకి దిగింది. సాక్షాత్తూ సోనియా గాంధీయే పంజాబ్ ఎంపీలకు, సీఎంకు ఫోన్ చేసి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. చివరకు సీఎం అమరీందర్‌ను అధిష్ఠానం బుజ్జగించి, సిద్దూకు లైన్ క్లియర్ చేసింది. సిద్దూ ప్రమాణ స్వీకారానికి సీఎం అమరీందర్ హాజరు కారని అందరూ భావించారు. కానీ, సీఎం అమరీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసి, అక్కడే సిద్దూకు కౌంటర్ ఇచ్చారు. ‘‘సిద్దూ పుట్టిన సందర్భంలో నేను సరిహద్దుల్లో జవానుగా బాధ్యతల్లో ఉన్నాను’’ అని సీఎం వ్యాఖ్యానించారు. సిద్దూకు ఇది ఓ కౌంటర్ రకంగానే భావించాల్సి ఉంటుందని సీఎం వర్గీయులు పేర్కొంటున్నారు. పంజాబ్‌లో తామిద్దరమూ పార్టీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. తాము సిద్దూకు మద్దతిస్తామని, అందులో సందేహం అవసరమే లేదని సీఎం హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-07-23T22:01:45+05:30 IST