సీఎం సహాయనిధి పేదలకు వరం

ABN , First Publish Date - 2021-10-20T04:36:03+05:30 IST

సీఎం సహాయనిధి పేదలకు వరం

సీఎం సహాయనిధి పేదలకు వరం
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

పరిగి(రూరల్‌): సీఎం సహాయనిధి పేదల పాలిట వరం లాంటిదని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. పరిగిలోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం 18మంది లబ్ధిదారులకు రూ.13లక్షల వెయ్యి విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో చికిత్స పొందిన పేదలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థికసాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు ఆర్‌.ఆంజనేయులు, నాయకులు ప్రవీన్‌రెడ్డి, నార్మాక్స్‌ డైరెక్టర్‌ వెంకట్‌రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:36:03+05:30 IST