CLP Leaders: భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సీఎల్పీ నేతలు
ABN , First Publish Date - 2022-08-16T16:40:57+05:30 IST
భద్రాద్రి శ్రీ సీతారామచంద్రమూర్తిని మంగళవారం ఉదయం సీఎల్పీ నేతలు దర్శించుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రమూర్తిని మంగళవారం ఉదయం సీఎల్పీ నేతలు (CLP Leaders) దర్శించుకున్నారు. రామయ్యను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Batti vikramarka), సీఎల్పీ నాయకులు శ్రీధర్ (Sridhar), జీవన్ రెడ్డి (Jeevan reddy), బలరాం నాయక్ (Balaram naik), ములుగు ఎమ్మెల్యే సీతక్క (Seethakka), భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య (Veeraiah) దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన సీఎల్పీ నేతలకు ఆలయ ఈఓ శివాజీ (Shivaji) పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీ తయారు అమ్మవారి ఆలయం వద్ద సీఎల్పీ నేతలను శాలువాతో సత్కరించి, వేద ఆశీర్వచనం అందించారు.