భట్టి స్వగ్రామానికి సాదాబైనామా లేనట్టే!

ABN , First Publish Date - 2020-10-24T08:46:16+05:30 IST

భట్టి స్వగ్రామానికి సాదాబైనామా లేనట్టే!

భట్టి స్వగ్రామానికి సాదాబైనామా లేనట్టే!

వైరా మునిసిపాలిటీలో కలపడం వల్లే..


 వైరా, అక్టోబరు 23: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురం ప్రజలు.. సాదాబైనామా ద్వారా క్రయవిక్రయాలు జరిపిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందే అవకాశాన్ని కోల్పోయారు. 2014 జూన్‌ 2కు ముందు వరకు జరిగిన సాదాబైనామా లావాదేవీలకు పాసుపుస్తకాలు మంజూరు చేసేలా ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు గ్రామాలకు మాత్రమే వర్తిస్తాయి. స్నానాల లక్ష్మీపురం కూడా గ్రామ పంచాయతీయే. కానీ, ఇక్కడే ఓ మెలిక ఉంది. ఇది.. సోమవరం రెవెన్యూ గ్రామంలో భాగంగా ఉంది. ఈ సోమవరం రెవెన్యూ గ్రామం.. వైరా మునిసిపాలిటీ పరిధిలో ఉంది. దీంతో.. స్నానాల లక్ష్మీపురం పంచాయతీ కూడా రెవెన్యూ లెక్కల ప్రకారం వైరా మునిసిపాలిటీ పరిధిలోకి వెళ్లిపోయింది. దీంతో.. సీఎల్పీ నేత స్వగ్రామం.. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని కోల్పోయింది.

Updated Date - 2020-10-24T08:46:16+05:30 IST