దేశంలో బీజేపీ నియంత పాలన సాగిస్తోంది: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2022-08-15T03:20:54+05:30 IST

దేశంలో బీజేపీ (Bjp) నియంత పాలన సాగిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కల్లూరు ..

దేశంలో బీజేపీ నియంత పాలన సాగిస్తోంది: భట్టి విక్రమార్క

ఖమ్మం: దేశంలో బీజేపీ (Bjp) నియంత పాలన సాగిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Clp leader Batti Vikramarka) అన్నారు. కల్లూరు మండలం ఖాన్ పేటలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ (Congress) హయాంలోనే బాహుళార్థక ప్రాజెక్ట్‌లు నిర్మించారని చెప్పారు. దేశ ప్రజలకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. మసిపూసి మాయ చేస్తున్నారే తప్ప బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు భట్టి విక్రమార్క పిలుపు నిచ్చారు. 


Updated Date - 2022-08-15T03:20:54+05:30 IST