అరకు దారిలో మేఘమాల
ABN , First Publish Date - 2021-06-24T09:09:37+05:30 IST
వర్షాకాలం ప్రారంభం కావడంతో విశాఖ ఏజెన్సీ సీజనల్ అందాలతో కనువిందు చేస్తోంది. పచ్చటి అడవులతో నిండిన ఎత్తయిన కొండలు, వాటిపై పవళించిన పాల నురగలాంటి మేఘాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి
అనంతగిరి : వర్షాకాలం ప్రారంభం కావడంతో విశాఖ ఏజెన్సీ సీజనల్ అందాలతో కనువిందు చేస్తోంది. పచ్చటి అడవులతో నిండిన ఎత్తయిన కొండలు, వాటిపై పవళించిన పాల నురగలాంటి మేఘాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. విశాఖ నుంచి అరకులోయ వెళ్లే మార్గంలో అనంతగిరి మండలం తైడా, డముకు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం అందమైన ఈ దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయి.