ప్రాంతీయ భాషల్లోనూ క్లాట్.. పరిశీలనకు కమిటీ
ABN , First Publish Date - 2020-07-05T08:00:32+05:30 IST
ప్రాంతీయ భాషల్లోనూ క్లాట్.. పరిశీలనకు కమిటీ
హైదరాబాద్, జూలై 4(ఆంధ్రజ్యోతి): జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో యుజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని భావిస్తున్నారు. దీని పరిశీలనకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమించింది.