ప్రధాన ఆలయాల మూసివేత
ABN , First Publish Date - 2021-04-17T05:51:23+05:30 IST
కరోనా ఉధృతి కారణంగా పట్టణంలోని ప్రధాన ఆలయాలైన బుగ్గరామలింగేశ్వరస్వామి, చింతల వెంకటరమణస్వామి ఆలయాలు శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు ఈఓ నరసయ్య తెలిపారు.
తాడిపత్రి టౌన, ఏప్రిల్ 16: కరోనా ఉధృతి కారణంగా పట్టణంలోని ప్రధాన ఆలయాలైన బుగ్గరామలింగేశ్వరస్వామి, చింతల వెంకటరమణస్వామి ఆలయాలు శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు ఈఓ నరసయ్య తెలిపారు. కేంద్రప్రభుత్వం, భారత పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయాలను మూసివేశామన్నారు. మే 15 వరకు మూసివేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆలయాల్లో స్వామివారికి ఏకాంతంగా సేవలు ఉంటాయని, భ క్తులకు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు.