కరోనా విస్తరణకు కారణమవుతున్న క్లినిక్‌ల మూసివేత

ABN , First Publish Date - 2020-05-27T09:44:20+05:30 IST

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో కొవిడ్‌ వైరస్‌ విస్తరణకు కారణమవుతున్న ఆర్‌ఎంపీ క్లినిక్‌లను

కరోనా విస్తరణకు కారణమవుతున్న క్లినిక్‌ల మూసివేత

ముషీరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్‌ నియోజకవర్గంలో కొవిడ్‌ వైరస్‌ విస్తరణకు కారణమవుతున్న ఆర్‌ఎంపీ క్లినిక్‌లను మూసివేశామని జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. పఠాన్‌బస్తీలోని కట్టడి ప్రాంతాల్లో ఆయనతోపాటు డీఎంసీ ఉమాప్రకాష్‌, ఏఎంవోహెచ్‌ డాక్టర్‌ హేమలత, అడిషనల్‌ జిల్లా వైద్యశాఖాధికారి సరళకుమారి పర్యటించారు.


ఈ సందర్భంగా జోనల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులకు కొంతమంది గుంపులుగా వైద్యపరీక్షలకు వెళ్లడం వల్లే వైరస్‌ విస్తరిస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఆయా ప్రాంతాలను కట్టడి చేయడంతోపాటు వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ మౌనిక, పీహెచ్‌ఎన్‌ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2020-05-27T09:44:20+05:30 IST