నగరంలోనే మూసివేత
ABN , First Publish Date - 2021-05-09T05:31:33+05:30 IST
కర్ఫ్యూ నాలుగో రోజు శనివారం మధ్యాహ్నం 12 తర్వాత దుకాణాలన్నీ మూతపడినా.
కర్నూలు, మే 8(ఆంధ్రజ్యోతి): కర్ఫ్యూ నాలుగో రోజు
శనివారం మధ్యాహ్నం 12 తర్వాత దుకాణాలన్నీ మూతపడినా.. శివారున ఉన్నవి మాత్రం
తెరిచే ఉంచారు. నిత్యావసరాలు, ఇతరాల కోసం ప్రజలు ఉదయం పూట బయటకు రావడంతో
ఆయా కూడళ్ల వద్ద ట్రాఫిక్ జాం నెలకొంది. మధ్యాహ్నం తర్వాత నగరంలో జన
సంచారం లేకున్నా.. శివారు ప్రాంతాల్లో మాత్రం ఆటోలు, ద్విచక్రవాహనాలు
తిరగడం కనిపించింది. మధ్యాహ్నం నుంచి బస్సులు తిరగకపోవడంతో బస్టాండ్లో
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపించలేదు. ఇతర రాష్ట్రాల బస్సులను, వాహనాలను
నిర్దేశిత సమయం తర్వాత సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారు.