నేటి నుంచి స్వచ్ఛత క్యాంపెయిన్
ABN , First Publish Date - 2022-10-02T06:13:37+05:30 IST
నేటి నుంచి స్వచ్ఛత క్యాంపెయిన్
గన్నవరం(ఉంగుటూరు), అక్టోబరు 1: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం నుంచి ఈనెల 30వరకు స్వచ్ఛత క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. శనివారం విమానాశ్రయంలో స్వచ్ఛత క్యాంపెయిన్ బ్రోచర్ను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత్రెడ్డి, కలెక్టర్ పి.రంజిత్బాషా, ఎస్పీ పి.జాషువాతో కలిసి ఆయన ఆవిష్కరించారు. విమానాశ్రయంలోని అన్ని కార్యాలయాల్లో పెండింగ్ పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తిచేసేందుకు కేంద్రప్రభుత్వం 2.0 స్పెషల్ క్యాంపెయిన్ను ప్రారంభించిందని ఎంపీ తెలిపారు.