స్టీల్‌ప్లాంట్‌కు స్వచ్ఛతపక్వాడా అవార్డు

ABN , First Publish Date - 2022-07-02T06:27:11+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు స్వచ్ఛతపక్వాడాలో ప్రథమ బహుమతి లభించింది. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఉక్కు మంత్రిత్వశాఖ కన్సల్టేటివ్‌ కమిటీ సమావేశంలో కేంద్ర ఉక్కుశాఖా మంత్రి రామచంద్రప్రసాద్‌సింగ్‌ చేతులమీదుగా స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌ అవార్డు అందుకున్నారు.

స్టీల్‌ప్లాంట్‌కు స్వచ్ఛతపక్వాడా అవార్డు
కేంద్ర ఉక్కుశాఖమంత్రి రామచంద్రప్రసాద్‌సింగ్‌ నుంచి అవార్డు అందుకుంటున్న ఉక్కు సీఎండీ అతుల్‌భట్‌

కేంద్ర మంత్రి నుంచి స్వీకరించిన ఉక్కు సీఎండీ 

ఉక్కుటౌన్‌షిప్‌, జూలై 1: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు స్వచ్ఛతపక్వాడాలో ప్రథమ బహుమతి లభించింది. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఉక్కు మంత్రిత్వశాఖ కన్సల్టేటివ్‌ కమిటీ సమావేశంలో కేంద్ర ఉక్కుశాఖా మంత్రి రామచంద్రప్రసాద్‌సింగ్‌ చేతులమీదుగా స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌ అవార్డు అందుకున్నారు. దేశంలో అతిపెద్ద పారిశుధ్య ఉద్యమం స్వచ్ఛతపక్వాడాను విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సమర్థంగా అమలుచేసినందుకు గాను 2021వ సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డు లభించింది. ఉక్కునగరంలో ఏడాది పొడవునా సఫాయి పక్వాడాను పాటిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. కాగా ఉక్కు ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగా అవార్డు లభించిందని సీఎండీ అతుల్‌భట్‌ పేర్కొన్నారు. 





Updated Date - 2022-07-02T06:27:11+05:30 IST