రోడ్డు ప్రమాదంలో క్లీనర్ దుర్మరణం
ABN , First Publish Date - 2021-10-20T06:24:34+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఓ క్లీనర్ దుర్మరణం చెందాడు.
యాదమరి, అక్టోబరు 19: రోడ్డు ప్రమాదంలో ఓ క్లీనర్ దుర్మరణం చెందాడు. ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపిన మేరకు వివరాలు.. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు మినీ లారీ ఒకటి బెంగళూరు నుంచి ఆలుగడ్డల లోడుతో చిత్తూరువైపు వెళుతోంది. వరిగిపల్లె వద్దకొచ్చేసరికి బెంగుళూరు - చెన్నై జాతీయ రహదారిపై ఆగి ఉన్న మరో మినీ లారీని ప్రమా దవశాత్తూ ఢీకొంది. ఈ సంఘటనలో కర్ణాటక సన్గల్దహల్లి గ్రామానికి చెందిన క్లీనర్ శ్రీరామప్ప (56) క్యాబిన్లో ఇరుక్కుని తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పొక్లెయినర్ సాయంతో మృతదేహాన్ని వెలికితీసి, చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.