కడ్తాలను స్వచ్ఛ పంచాయతీగా తీర్చిదిద్దుతాం

ABN , First Publish Date - 2022-08-10T05:49:42+05:30 IST

కడ్తాలను స్వచ్ఛ పంచాయతీగా తీర్చిదిద్దుతాం

కడ్తాలను స్వచ్ఛ పంచాయతీగా తీర్చిదిద్దుతాం
గ్రామ పంచాయతీ కార్మికలకు సబ్బులు, నూనె అందజేస్తున్న సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి, వార్డు మెంబర్లు

కడ్తాల్‌, ఆగస్టు 9: కడ్తాల గ్రామ పారిశుధ్య కార్మికులకు మంగళవారం సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపణీ చేశారు. పంచాయతీ సభ్యులతో కలిసి సబ్బులు, సర్ఫ్‌, కొబ్బరినూనె, టూత్‌ పేస్ట్‌,  ఇతర సామగ్రి అందజేశారు. కడ్తాలను  స్వచ్ఛ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకరించాలని సర్పంచ్‌ కోరారు. ఉపసర్పంచ్‌ రామకృష్ణ, మార్కెట్‌ నాయకులు లాయక్‌అలీ, బిక్షపతి, నర్సింహ, వెంకటేశ్‌, రామచంద్రయ్య, శ్రీను, నాగార్జున, సురేశ్‌, కార్యదర్శి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:49:42+05:30 IST