ఇరు వర్గాల మధ్య ఘర్షణ: ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2021-01-17T05:09:29+05:30 IST

రాజంపేటలో బీఎస్‌హాల్‌ వద్ద శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

ఇరు వర్గాల మధ్య ఘర్షణ: ముగ్గురికి గాయాలు

రాజంపేట టౌన్‌, జనవరి 16: రాజంపేటలో బీఎస్‌హాల్‌ వద్ద  శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే శనివారం రాత్రి 11 గంటల సమయంలో పట్టణానికి చెందిన నరేష్‌, షేక్‌ ఇన్నా, ప్రేమ్‌ బైపాస్‌లో టీ తాగుతుండగా  సాతుపల్లెకు చెందిన దాదాపు 20 మంది కాపు కాచి దాడి జరపడంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. నరేష్‌, షేక్‌ ఇన్నాను కడప రిమ్స్‌కు తరలించారు. ప్రేమ్‌ స్థానికంగా చికిత్స పొందుతున్నాడు. దాడిలో సుంకర్‌, మోహన్‌, షేక్‌ హిన్వా, చరణ్‌, తేజ, రాజేష్‌, మున్నా, రాము తదితరులు ఉన్నట్లు పోలీసుల తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. 

Updated Date - 2021-01-17T05:09:29+05:30 IST