హుజూర్నగర్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఘర్షణ
ABN , First Publish Date - 2021-06-19T02:10:17+05:30 IST
జిల్లాలోని హుజూర్నగర్ పట్టణంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ
సూర్యాపేట: జిల్లాలోని హుజూర్నగర్ పట్టణంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. మట్టి పనుల విషయంలో కౌన్సిలర్ కోతి సంపత్రెడ్డి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు మధ్య గొడవ జరిగింది. టీఆర్ఎస్, టీఆర్ఎస్ రెబల్ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాయి.