ఇరువర్గాల మధ్య ఘర్షణ - ముగ్గురికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2022-07-04T04:54:37+05:30 IST

ముసల్‌రెడ్డిపల్లిలో ఆదివారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యా యి.

ఇరువర్గాల మధ్య ఘర్షణ - ముగ్గురికి తీవ్రగాయాలు
గాయాల పాలై చికిత్స పొందుతున్న శివనాగిరెడ్డి

సింహాద్రిపురం, జూలై 3: ముసల్‌రెడ్డిపల్లిలో ఆదివారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యా యి. ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి సమాచారం  మేరకు గ్రామం లో శివనాగిరెడ్డి కుటుంబ సభ్యులకు, సోమిరెడ్డి కుటుంబ సభ్యులకు గతంలో పాత కక్షలుండేవి. ఈ కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో శివనాగిరెడ్డి అతని కుమారులు శివకుమార్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డికి తీవ్ర గా యాలవడంతో చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాధితుడు శివకుమార్‌రెడ్డి ఫిర్యాదుపఐ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

యువకునిపై కత్తితో దాడి

ప్రొద్దుటూరు క్రైం, జూలై 3: తన బైక్‌ను కిందపడేశావని అడిగినందుకు షేక్‌ అన్వర్‌పై ఇక్బాల్‌  కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన ఆదివారం పెన్నానగర్‌ లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేర కు... షేక్‌ అన్వర్‌ తన మిత్రులతో కలిసి పెన్నానగర్‌లో మాట్లాడుతూ ఇంటికి వెళ్తుండగా నిలిపి ఉన్న అన్వర్‌ బైక్‌ను ఇక్బాల్‌ కిందపడేశాడు. ఈ క్రమంలో తన బైక్‌ను ఎందుకు కిందపడేశావని ఇక్బాల్‌ను అన్వర్‌ ప్రశ్నించా డు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్ర మంలోనే ఇక్బాల్‌ తన వద్ద ఉన్న కత్తితో అన్వర్‌పై దాడి చేశాడు. అన్వర్‌ తలకు, వీపుపై తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అన్వర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌ తెలిపారు.



Updated Date - 2022-07-04T04:54:37+05:30 IST