ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై ఏపీ అధికారుల క్లారిటీ
ABN , First Publish Date - 2020-06-03T00:17:17+05:30 IST
ఏపీలో ప్రభుత్వోద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడుతున్నాయి
అమరావతి: ఏపీలో ప్రభుత్వోద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడుతున్నాయి. సగం మంది పెన్షనర్లు, ఉద్యోగులకు ఇంకా వేతనాలు ఇవ్వలేదు. సచివాలయ ఉద్యోగుల ఖాతాల్లో మాత్రం వేతనాలు జమ అయ్యాయి. కానీ హెచ్వోడీ, జిల్లా స్థాయి అధికారులకు మాత్రం ఇంకా జీతాలు పడలేదు. ఈ గందరగోళంపై ఏపీ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు స్పష్టం చేశారు.