సీజేఐ రమణ మ్యాచ్‌ ప్రారంభించి.. బ్యాట్‌పట్టి!

ABN , First Publish Date - 2022-04-04T08:46:17+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు రెండు జట్లుగా విడివడి టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌ ఆడారు.

సీజేఐ రమణ మ్యాచ్‌ ప్రారంభించి.. బ్యాట్‌పట్టి!

ఎస్‌సీబీఏ-11, సీజేఐ-11 మధ్య టీ-20 మ్యాచ్‌ 

72 పరుగుల తేడాతో సీజేఐ-11 గెలుపు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు రెండు జట్లుగా విడివడి  టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌ ఆడారు. ఈ మ్యాచ్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రారంభించారు. ‘చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా ఎలెవన్‌’ (సీజేఐ-11), సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఎలెవన్‌ (ఎస్‌సీబీఏ-11) మధ్య జరిగిన మ్యాచ్‌లో 72 పరుగులతో సీజేఐ-11 విజయం సాధించింది. మ్యాచ్‌ సందర్భంగా ఎస్‌సీబీఏ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ బౌలింగ్‌ చేయగా కొన్ని బంతులకు సీజేఐ ఎన్‌వీ రమణ బ్యాటింగ్‌ చేశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీజేఐ-11 నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పుగులు చేసింది. లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఎస్‌సీబీఏ-11 12.4 ఓవర్లలో 88 పరుగులకు అలౌట్‌ అయింది.

Updated Date - 2022-04-04T08:46:17+05:30 IST