Kurnool: శ్రీశైలంలో సీజేఐ ఎన్వీ రమణ ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-03-14T13:26:39+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామి దేవస్థానంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Kurnool: శ్రీశైలంలో సీజేఐ ఎన్వీ రమణ ప్రత్యేక పూజలు

కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామి దేవస్థానంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం వేకువజామున సుప్రభాతం మహామంగళ హారతి సేవలో సీజేఐ దంపతులు పాల్గొన్నారు. సీజేఐకు ఆలయ మర్యాదలతో అర్చకులు, ఈవో లవన్న  జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.  ఎన్.వి.రమణ దంపతులు  స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. 

Updated Date - 2022-03-14T13:26:39+05:30 IST