మధిర కోర్టు సమస్యలపై సీజేఐ సానుకూలత

ABN , First Publish Date - 2021-06-17T05:11:57+05:30 IST

మధిర కోర్టులో నెలకొన్న సమస్యల పరిష్కారంపై సూప్రింకోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ సానుకూలత వ్యక్తం చేశారని బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు బి. శ్రీనివాసరావు తెలిపారు.

మధిర కోర్టు సమస్యలపై సీజేఐ సానుకూలత
సీజేఐ ని కలిసిన మధిర న్యాయవాదులు

 భారత ప్రధాన న్యాయయూర్తిని కలిసిన మధిర ‘బార్‌’ నాయకులు

మధిరటౌన్‌, జూన్‌ 16: మధిర కోర్టులో నెలకొన్న సమస్యల పరిష్కారంపై సూప్రింకోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ సానుకూలత వ్యక్తం చేశారని బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు బి. శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మధిర బార్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లో ప్రధాన న్యాయమూర్తిని కలిసి మధిర సబ్‌ కోర్టు మంజూరు విషయం అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని మధిర కోర్టు భవనం చాలా పురాతనమైనదని నూతన భవనం మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. వీటిపై సీజేఐ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వాసంశెట్టి కోటేశ్వరరావు, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, దిరిశాల జగన్మోహనరావు, గోపాల్‌, జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-17T05:11:57+05:30 IST