సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష యథాతథం
ABN , First Publish Date - 2020-10-01T08:52:32+05:30 IST
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది...
- వాయిదా వేయాలన్న పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
- 4న పరీక్షకు పూర్తయిన ఏర్పాట్లు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది. దీంతో అక్టోబరు 4న ఈ పరీక్ష యథాతథంగా జరగనుంది. కరోనా వ్యాప్తి, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వరదల వల్ల పరీక్షలను వాయిదావేయాలంటూ కొంతమంది ఆశావహులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈకేసును విచారించిన జస్టిస్ ఎం.కె. ఖన్విల్కర్, జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కృష్ణమురారితో కూడిన ధర్మాసనం పరీక్షవాయిదా వేయాలన్న అభ్యర్థనలను తిరస్కరిస్తూ తీర్పు చెప్పింది. చివరిసారిగా పరీక్షరాస్తున్న వారు కరోనా వల్ల హాజరుకాకుంటే వారికి మరోసారి అవకాశం కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని కోర్టు కేంద్రానికి సూచించింది. దేశంలోని 72 నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది. సుమారు 6 లక్షల మంది రాయనున్నారు.