రేషన్ అక్రమార్కులపై ఆ అధికారి ఉక్కు పాదం

ABN , First Publish Date - 2021-06-12T22:45:44+05:30 IST

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ నారాయణ పేట జిల్లా లో ఇటీవల రేషన్ అక్రమార్కులపై పెద్దయెత్తున దాడులు నిర్వహిస్తున్నారు.

రేషన్ అక్రమార్కులపై ఆ అధికారి ఉక్కు పాదం

నారాయణపేట: పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ నారాయణ పేట జిల్లా లో ఇటీవల రేషన్ అక్రమార్కులపై పెద్దయెత్తున దాడులు నిర్వహిస్తున్నారు.అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నారు.ముఖ్యంగా ప్రజా పంపిణీ బియ్యం ను గుట్టుగా సరిహద్దులు దాటించే ఘరానా వ్యక్తులను వదిలి పెట్టడం లేదు.పెట్రోల్ బంకు లు వినియోగ దారుల ను మోసం చేస్తే..తన దైన శైలిలో తనిఖీలు చేపట్టి కేసులు నమోదుచేశారు. గుట్టుగా తరలిస్తున్నప్రజా పంపిణీ బియ్యం తరలి పోకుండా పట్టుకున్నారు. తాజాగా శనివారం ఉదయం ప్రజాపంపిణీ బియ్యం ను ప్రజల వద్ద అధిక ధరకు సేకరించిన వెంకటేష్ అనే రేషన్ బియ్యం మాఫియా కు చెందిన వ్యక్తి ఆ బియ్యాన్ని తిరిగి అధిక ధరకు అమ్మ డానికి వెళ్తుండగా అమరచింత కు చెందిన మరికల్ పోలీసులు, రఘునందన్ సంయుక్తంగా కలసి పట్టుకున్నారు. అక్రమార్కులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా రఘునందన్ తీవ్రంగా హెచ్చరించారు

Updated Date - 2021-06-12T22:45:44+05:30 IST