ఆ విద్యార్థులు కాలేజీలకు బైక్‏లపై రావొద్దు

ABN , First Publish Date - 2022-07-07T16:43:32+05:30 IST

పీయూసీ విద్యార్థులు కళాశాలలకు బైకులపై రావడాన్ని నిషేధిస్తున్నామని, ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర

ఆ విద్యార్థులు కాలేజీలకు బైక్‏లపై రావొద్దు

                             - నగర ట్రాఫిక్‌ కమిషనర్‌ రవికాంతేగౌడ 


బెంగళూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): పీయూసీ విద్యార్థులు కళాశాలలకు బైకులపై రావడాన్ని నిషేధిస్తున్నామని, ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర ట్రాఫిక్‌ విభాగం కమిషనర్‌ రవికాంతేగౌడ తెలిపారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీయూ చదివే విద్యార్థులు డ్రైవింగ్‌ లైసన్స్‌ పొందేందుకు వయసురీత్యా అర్హత ఉండదన్నారు. లైసెన్సులు లేకుండా బైకులపై  కళాశాలలకు రావడం సరికాదన్నారు. నగర వ్యాప్తంగా నకిలీ నంబరు ప్లేట్లు కలిగిన వాహనాలు పట్టుబడితే సంబంధిత యజమానిని జైలుకు పంపుతామన్నారు. జూన్‌లో మద్యం సేవించి వాహనాలు నడపటం ద్వారా 22 మంది ప్రమాదాలకు గురై మరణించారని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. నగరంలో వాహనాల తనిఖీ సాధారణంగానే సాగుతుందన్నారు. అనుమానం కలిగిన వాహనాలపై నిఘా నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించే బాధ్యత ప్రతి వాహనదారుడిపైనా ఉంటుందన్నారు.

Updated Date - 2022-07-07T16:43:32+05:30 IST