కస్టమర్ కేర్కు ఫోన్ చేస్తే..ఎనీడెస్క్ ఇన్స్టాల్ చేయించారు
ABN , First Publish Date - 2020-10-23T10:10:32+05:30 IST
గూగుల్లో కస్టమర్ కేర్ పేరుతో ఉన్న నంబర్లకు ఫోన్చేసి, వారు చెప్పిన విధంగా విని మోసపోవద్దని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నగరవాసి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 70 వేలు మాయం
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 22 (ఆంధ్రజ్యోతి): గూగుల్లో కస్టమర్ కేర్ పేరుతో ఉన్న నంబర్లకు ఫోన్చేసి, వారు చెప్పిన విధంగా విని మోసపోవద్దని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకు ఈ సంఘటనే కారణం. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సంస్థను నిర్వహిస్తున్నాడు. అతడి వద్దకు వచ్చిన ఓ కస్టమర్ చెప్పిన ఖాతాకు నగదు బదిలీ కాకపోవడంతో కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్లో వెతికాడు. అందులో ఉన్న నంబర్లకు ఫోన్ చేసి నగదు బదిలీ కాలేదని ఫిర్యాదు చేశాడు. వారు సూచించిన విధంగా ఎనీడెస్క్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని వివరాలు వారికి తెలిపాడు. వెంటనే అతడి ఖాతా నుంచి రూ. 70 వేలు మాయమయ్యాయి. బాధితుడు సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.