కార్మికులందరికీ వేతనాలివ్వాలి: సీఐటీయూ

ABN , First Publish Date - 2020-04-03T07:49:47+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్‌, అసంఘటిత రంగాల్లోని కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ విషయమై ప్రభుత్వం...

కార్మికులందరికీ వేతనాలివ్వాలి: సీఐటీయూ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్‌, అసంఘటిత రంగాల్లోని కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ విషయమై ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసినా యాజమాన్యాలు పేచీలు పెడుతున్నాయని ఆరోపించింది. ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 27ను వెంటనే ఉపసంహరించుకోవాలని వీఆర్‌వో, వీఆర్‌ఏ జేఏసీ డిమాండ్‌ చేసింది. కరోనా కట్టడి కోసం శ్రమిస్తున్న మునిసిపల్‌, పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల వేతనాల్లో కోతలు విధించడం సరికాదని తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీలు పేర్కొన్నాయి.

Updated Date - 2020-04-03T07:49:47+05:30 IST