ధరల పెరుగుదలపై సీఐటీయూ ధర్నా
ABN , First Publish Date - 2021-02-27T05:55:16+05:30 IST
ధరల పెరుగుదలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం సబ్బవరంలో ధర్నా చేశారు.
సబ్బవరం, ఫిబ్రవరి 26 : ధరల పెరుగుదలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం సబ్బవరంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల నాయకురాలు ఉప్పాడ సత్యవతి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమాలు చేసి ప్లాంటును రక్షించుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పప్పుల కోటి, ఎం.గౌరేసు, కె.కోటేశ్వరరావు, పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.