మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా

ABN , First Publish Date - 2021-05-09T05:50:58+05:30 IST

మున్సిపల్‌ కార్మికుల పీఎఫ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా

నిజామాబాద్‌అర్బన్‌, మే 8: మున్సిపల్‌ కార్మికుల పీఎఫ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రమేష్‌బాబు, మల్యాలగోవర్ధన్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల ఖాతాల్లో జమచేయాల్సిన పీఎఫ్‌ డబ్బులను ఇతరుల ఖాతాల్లోకి జమ చేయడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఇతర ఖాతాల్లో వేసిన డబ్బులను కార్మికుల ఖాతాల్లోకి జమ చేయాలన్నారు. రాత్రిపూట లాక్‌డౌన్‌ ఉండడం వల్ల ఉదయం 4 గంటలకు విధులకు హాజరుకావాల్సిన కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారని వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కిషన్‌, నారాయణ, సాయిలు, భూమ య్య, ప్రశాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:50:58+05:30 IST