నాణ్యమైన సేవలు పొందటం పౌరుల హక్కు
ABN , First Publish Date - 2022-01-25T07:40:13+05:30 IST
నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు పొందటం పౌరుల హక్కు అని రాష్ట్ర మంత్రి
వినియోగదారుల చట్టం ప్రకటనలు విడుదల చేసిన గంగుల
నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు పొందటం పౌరుల హక్కు అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వినియోగదారుల చట్టం-2019కు సంబంధించి ఆ శాఖ రూపొందించిన ప్రసార ప్రకటనలను సోమవారం గంగుల విడుదల చేశారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో కమిషనర్ అనిల్కుమార్, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్రెడ్డితోపాటు పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినియోగదారులు నాణ్యమైన వస్తు, ఇతర సేవలు పొందేవిధంగా అధికారులు సేవలు అందించాలని గంగుల సూచించారు. వినియోగదారులు తమకు అందే సేవల్లో లోపాలు గుర్తిస్తే ఫిర్యాదులు చేయాలని సూచించారు.