నాణ్యమైన సేవలు పొందటం పౌరుల హక్కు

ABN , First Publish Date - 2022-01-25T07:40:13+05:30 IST

నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు పొందటం పౌరుల హక్కు అని రాష్ట్ర మంత్రి

నాణ్యమైన సేవలు పొందటం పౌరుల హక్కు

వినియోగదారుల చట్టం ప్రకటనలు విడుదల చేసిన గంగుల


నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు పొందటం పౌరుల హక్కు అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. వినియోగదారుల చట్టం-2019కు సంబంధించి ఆ శాఖ రూపొందించిన ప్రసార ప్రకటనలను సోమవారం గంగుల విడుదల చేశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో కమిషనర్‌ అనిల్‌కుమార్‌, డిప్యూటీ కమిషనర్‌ శ్రీకాంత్‌రెడ్డితోపాటు పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినియోగదారులు నాణ్యమైన వస్తు, ఇతర సేవలు పొందేవిధంగా అధికారులు సేవలు అందించాలని గంగుల సూచించారు. వినియోగదారులు తమకు అందే సేవల్లో లోపాలు గుర్తిస్తే ఫిర్యాదులు చేయాలని సూచించారు. 


Updated Date - 2022-01-25T07:40:13+05:30 IST