‘ఖని’లో ఘనంగా మల్లన్న పట్నాలు
ABN , First Publish Date - 2021-01-25T06:22:24+05:30 IST
రామగుండం కా ర్పొరేషన్ యాదవ సంఘం ఆధ్వర్యంలో రెం డురోజుల పాటు మల్లన్న పట్నాలను ఘనం గా నిర్వహించారు.
కళ్యాణ్నగర్, జనవరి 24: రామగుండం కా ర్పొరేషన్ యాదవ సంఘం ఆధ్వర్యంలో రెం డురోజుల పాటు మల్లన్న పట్నాలను ఘనం గా నిర్వహించారు. గోదావరిఖని సీతానగర్ వద్ద ఉన్న యాదవ సంఘం భవనంలో మల్లన్న పట్నాలను నిర్వహించారు. మొదటి రోజు శనివారం ఇందిరానగర్ నుంచి ఊరేగింపుగా పుట్టబంగారం తీసుకువచ్చారు. ఆదివారం పట్నాలు నిర్వహించారు. కళ్యాణమహోత్సవంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పట్నాల్లో డోలు, ఢమరుకం వాయించాడు. యాదవ సంఘం అధ్యక్షుడు పాతిపల్లి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పట్నాల్లో మేయర్ అనీల్కుమార్,బీజేపీ నాయకులు ఎస్ కుమార్, కౌశిక హరి, కార్పొరేటర్లు కౌశిక లత, కాల్వ స్వరూప, మేకల సదానందం, పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, కార్పొరేటర్లు పాతిపెల్లి లక్ష్మీఎల్లయ్య, అడ్డాల స్వరూపరామస్వామి, కాల్వ స్వరూపశ్రీనివాస్, మేకల సదానందం, బాల రాజ్కుమార్, అడ్డాల గట్టయ్య, మేకల సదానందం, పాతిపెల్లి రవి, మెండె లింగయ్య, మారుతి పాల్గొన్నారు.