Alert: పరీక్షల తేదీల వెల్లడి

ABN , First Publish Date - 2021-10-24T14:03:04+05:30 IST

పరీక్షల తేదీల..

Alert: పరీక్షల తేదీల వెల్లడి

‘ఆఫ్‌లైన్‌’లో సీఐఎస్‌సీఈ బోర్డు పరీక్షలు

10, 12వ తరగతుల పరీక్షల తేదీల వెల్లడి


న్యూఢిల్లీ: పది, పన్నెండవ తరగతులకు తొలి టర్మ్‌ బోర్డు పరీక్షల్ని ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్‌ కౌన్సిల్‌(సీఐఎస్‌సీఈ) శనివారం ప్రకటించింది. ఈ మేరకు సవరించిన తేదీల వివరాలను వెల్లడించింది. వాటి ప్రకారం.. పదవ తరగతి పరీక్షలు వచ్చే నెల 29 నుంచి మొదలై డిసెంబరు 16న, 12వ తరగతికి వచ్చే 12న మొదలై డిసెంబరు 20న ముగియనున్నాయి. నిజానికి నవంబరు 15 నుంచి 10వ తరగతికి, 16 నుంచి 12వ తరగతికి పరీక్షలు మొదలుకావాల్సి ఉండగా.. పలు కారణాల వలన పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు గత వారం సీఐఎస్‌సీఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-10-24T14:03:04+05:30 IST