Puneeth Rajkumar: పునీత్ జ్ఞాపకార్థం... ‘అప్పు ఎక్స్ప్రెస్’ అంబులెన్స్
ABN , First Publish Date - 2022-08-07T17:51:18+05:30 IST
అంబులెన్స్ సకాలానికి అందుబాటులోకి వచ్చి ఉంటే పవర్స్టార్ పునీత్రాజ్కుమార్(Puneeth Rajkumar) బతికి ఉండేవారనే ప్రజల్లో అభిప్రాయాలు
- నటుడు ప్రకాశ్రాజ్ వెల్లడి
బెంగళూరు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): అంబులెన్స్ సకాలానికి అందుబాటులోకి వచ్చి ఉంటే పవర్స్టార్ పునీత్రాజ్కుమార్(Puneeth Rajkumar) బతికి ఉండేవారనే ప్రజల్లో అభిప్రాయాలు తలెత్తరాదని ‘అప్పు’ పేరిట ఎక్స్ప్రెస్ అంబులెన్స్ ఏర్పాటు చేసినట్టు దక్షిణభారత ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) వెల్లడించారు. మైసూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాశ్రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైసూరులోని మిషన్ ఆసుపత్రికి అంబులెన్స్ను సమకూర్చారు. ఈ సందర్భంగా ప్రకాశ్రాజ్ మాట్లాడుతూ అప్పు పేరిట రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఉచిత అంబులెన్స్లు ఫౌండేషన్ ద్వారా సమకూర్చదలిచినట్టు తెలిపారు. పునీత్ రాజ్కుమార్ మానవత్వ సేవలకు స్ఫూర్తిగా అంబులెన్స్లు ఏర్పాటు చేయదలిచామన్నారు. పునీత్ చిన్న వయస్సులోనే శాశ్వతమైన పనులు చేశారని, అదే ఆలోచనతో అప్పు ఎక్స్ప్రెస్ అంబులెన్స్(Appu Express Ambulance)లను ఏర్పాటు చేయదలిమన్నారు. మైసూరు మిషన్ ఎక్స్ప్రెస్ ఆసుపత్రి ప్రాంగణంలో బ్లడ్బ్యాంక్ కూడా ఏర్పాటు చేయదలిచామన్నారు. పునీత్తో కలసి మూడు సినిమాలు మాత్రమే చేశానని, ఓ సందర్భంలో నాకు కానుక రూపంలో సాయం చేశారని గుర్తు తెచ్చుకున్నారు.