భూమా అఖిలప్రియకు సీఐడీ నోటీసులు
ABN , First Publish Date - 2020-09-24T03:36:51+05:30 IST
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ క్వారంటైన్ సెంటర్కు వెళ్లి కరోనా వ్యాప్తి చేశారని ..
కర్నూలు: మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ క్వారంటైన్ సెంటర్కు వెళ్లి కరోనా వ్యాప్తి చేశారని అఖిలప్రియ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హఫీజ్ ఖాన్ సీరియస్ అయ్యారు. ఆయన సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అఖిలప్రియను సీఐడీ అధికారులు గురువారం విచారించనున్నారు.