మూడోరోజూ పీహెచ్‌సీల్లో తనిఖీలు

ABN , First Publish Date - 2021-04-13T05:56:56+05:30 IST

బయో మెడికల్‌ పరికరాల నిర్వహణలో నిధులు దుర్వినియోగం అయ్యాయనే కేసు విచారణలో భాగంగా మూడో రోజు కూడా సీఐడీ అధికారులు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.

మూడోరోజూ పీహెచ్‌సీల్లో తనిఖీలు
కావూరు పీహెచ్‌సీలో రికార్డులు తనిఖీ చేస్తున్న సీఐడీ అధికారులు

గుంటూరు, ఏప్రిల్‌ 12: బయో మెడికల్‌ పరికరాల నిర్వహణలో నిధులు దుర్వినియోగం అయ్యాయనే కేసు విచారణలో భాగంగా మూడో రోజు కూడా సీఐడీ అధికారులు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. సీఐడీ అదనపు ఎస్పీ ఆర్‌.విజయపాల్‌ ఆధ్వర్యంలో సోమవారం కావూరు, అప్పికట్ల, వెదుళ్లపల్లి, చండ్రాజుపాలెం, అమర్తలూరు, ఇంటూరు, మూల్పూరు, మోపర్రు, పొన్నెకల్లు, దుగ్గిరాల, ఈమని, నూతక్కి, గాదెవారిపాలెం, కారంపూడి, నకరికల్లు, చిన్నమట్టలపూడి తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 

   

Updated Date - 2021-04-13T05:56:56+05:30 IST