పాఠశాలకు సీఐ సురేష్‌ చేయూత

ABN , First Publish Date - 2022-06-25T06:57:43+05:30 IST

పట్టణంలోని గోవిందాపురం ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ సీఐ బొల్లెద్దు సురేష్‌ రంగులు వేయించారు.

పాఠశాలకు సీఐ సురేష్‌ చేయూత
గోవిందాపురం పాఠశాల

హుజూర్‌నగర్‌ , జూన్‌ 24:  పట్టణంలోని గోవిందాపురం  ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ సీఐ బొల్లెద్దు సురేష్‌  రంగులు వేయించారు. పట్టణంలోని  9వ వార్డుకు చెందిన బొల్లెద్దు సురేష్‌ చిన్నతనంలో ఈ పాఠశాలలో చదివారు. పాఠశాలకు రంగులు వేయించడంతో పాటు విద్యార్థులకు నోట్‌  పుుస్తకాలు, పెన్నులు, యూనిఫామ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా  సీఐ సురేష్‌ మాట్లాడుతూ తన తండ్రి  జెయిలు రిక్షా తొక్కి తనను చదివించారని తెలిపారు.   పాఠశాలకు రంగులు వేయించడం సంతోషంగా ఉందన్నారు. 




Updated Date - 2022-06-25T06:57:43+05:30 IST