పాఠశాలకు సీఐ సురేష్ చేయూత
ABN , First Publish Date - 2022-06-25T06:57:43+05:30 IST
పట్టణంలోని గోవిందాపురం ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సీఐ బొల్లెద్దు సురేష్ రంగులు వేయించారు.
హుజూర్నగర్ , జూన్ 24: పట్టణంలోని గోవిందాపురం ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సీఐ బొల్లెద్దు సురేష్ రంగులు వేయించారు. పట్టణంలోని 9వ వార్డుకు చెందిన బొల్లెద్దు సురేష్ చిన్నతనంలో ఈ పాఠశాలలో చదివారు. పాఠశాలకు రంగులు వేయించడంతో పాటు విద్యార్థులకు నోట్ పుుస్తకాలు, పెన్నులు, యూనిఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ సురేష్ మాట్లాడుతూ తన తండ్రి జెయిలు రిక్షా తొక్కి తనను చదివించారని తెలిపారు. పాఠశాలకు రంగులు వేయించడం సంతోషంగా ఉందన్నారు.