పోలీసుల ముందు లొంగిపోయిన సీఐ నాగేశ్వరరావు

ABN , First Publish Date - 2022-07-10T20:49:26+05:30 IST

హైదరాబాద్: మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావు ఎస్‌వోటీ అధికారుల ముందు లొంగిపోయారు. మహిళపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో ఆయన నిందితుడు. తనపై కేసు నమోదు కావడంతో గత రెండ్రోజులుగా సీఐ పరారీలో ఉన్నారు. ఇప్పటికే సీఐ నాగేశ్వరరావును సీపీ సీవీ ఆనంద్‌ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

పోలీసుల ముందు లొంగిపోయిన సీఐ నాగేశ్వరరావు

హైదరాబాద్: మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావు ఎస్‌వోటీ అధికారుల ముందు లొంగిపోయారు. మహిళపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో ఆయన నిందితుడు. తనపై కేసు నమోదు కావడంతో గత రెండ్రోజులుగా సీఐ పరారీలో ఉన్నారు. ఇప్పటికే సీఐ నాగేశ్వరరావును సీపీ సీవీ ఆనంద్‌ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.


సీఐపై అత్యాచారం, హత్యాయత్నం, అపహరణ కేసులు

తనపై అత్యాచారానికి పాల్పడ్డారని వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ ఆరోపించింది. తనను, భర్తను రివాల్వర్‌తో బెదిరించడమే కాకుండా వేధింపులకు గురిచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఇన్‌స్పెక్టర్‌పై అత్యాచారం, హత్యాయత్నం, అపహరణ కేసులను పోలీసులు నమోదు చేశారు.  



Updated Date - 2022-07-10T20:49:26+05:30 IST