సీఐ శ్రీనివాసరావు హఠాన్మరణం

ABN , First Publish Date - 2020-12-06T05:51:33+05:30 IST

సీఐ శ్రీనివాసరావు హఠాన్మరణం

సీఐ శ్రీనివాసరావు హఠాన్మరణం
సీఐ రెడ్డి శ్రీనివాసరావు (ఫైల్‌ ఫొటో)

బుచ్చెయ్యపేట, డిసెంబరు 5: సిటీ వీఆర్‌లో ఉన్న సీఐ రెడ్డి శ్రీనివాసరావు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. విశాఖ సిటీలోనే విధులు నిర్వహిస్తుండగా ఆరు నెలల క్రితం ఆయనకు స్ర్టోక్‌ రావడంతో సెలవులో ఉన్నారు. ఈ నెల 8న తిరిగి విధుల్లో చేరాల్సి ఉంది. ఈ నైపథ్యంలో వడ్డాది గిరిజాంబగిరిపై వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం భార్య, కుమార్తెలతో దేవాలయం మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే అనకాపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రభుత్వ విప్‌, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి, కొత్తకోట సీఐలు లక్ష్మి, లక్ష్మణమూర్తి, బుచ్చెయ్యపేట ఎస్‌ఐ రామకృష్ణ సీఐ పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు. శ్రీనివాసరావు పార్థివదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబీకులు తెలిపారు.

Updated Date - 2020-12-06T05:51:33+05:30 IST