రేణిగుంట అర్బన్ సీఐ అంజుయాదవ్ ప్రజలకు సూచనలు
ABN , First Publish Date - 2020-08-08T19:52:55+05:30 IST
తిరుపతి: శానిటైజర్ తాగి మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రేణిగుంట అర్బన్ సీఐ అంజుయాదవ్ సంచనల ప్రకటన చేశారు.
తిరుపతి: శానిటైజర్ తాగి మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రేణిగుంట అర్బన్ సీఐ అంజుయాదవ్ ప్రజలకు కొన్నా సూచనలు చేశారు. ప్రభుత్వం మద్యం ధరలు పెంచిందని తెలిసీ తెలియక పిచ్చి పిచ్చిగా తయారు చేసిన నాటుసారా తాగవద్దని ప్రజలకు సూచించారు. యాసిడ్ కలిపి కొన్ని సానిటైజర్లు తయారు చేసి అమ్ముతున్నారన్నారు. అది తాగితే ప్రాణాలు పోతాయన్నారు. మద్యం అలవాటుకు దూరం కావాలని... మానలేక పోతే ప్రభుత్వ దుకాణాల్లో తాగాలి కానీ.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని రేణిగుంట అర్బన్ సీఐ అంజుయాదవ్ తెలిపారు.