మళ్లీ పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలోనే ఎంపీ సీఎం

ABN , First Publish Date - 2020-08-03T22:02:55+05:30 IST

ఈరోజు రాఖీ పండుగను పురస్కరించుకుని ఐసోలేష‌న్ వార్డులో ప‌నిచేస్తున్న న‌ర్స్ ఒక‌రు శివరాజ్‌కు రాఖీ క‌ట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొందరగా

మళ్లీ పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలోనే ఎంపీ సీఎం

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పటికీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కోవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో ఆయన గత తొమ్మది రోజులుగా భోపాల్‌లోని సరయూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. అయితే ఈరోజు ఆయనకు మరోసారి కరోనా టెస్ట్ చేయగా మళ్లీ పాజిటివ్ అని తేలినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.


కాగా, ఈరోజు రాఖీ పండుగను పురస్కరించుకుని ఐసోలేష‌న్ వార్డులో ప‌నిచేస్తున్న న‌ర్స్ ఒక‌రు శివరాజ్‌కు రాఖీ క‌ట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్-19 నేప‌థ్యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ, మాస్క్, పీపీఈ కిట్ ధ‌రించి రాఖీ క‌ట్టి, మిఠాయిలు పంచారు.

Updated Date - 2020-08-03T22:02:55+05:30 IST