ధర్మపురిలో చోరీ
ABN , First Publish Date - 2020-07-03T10:43:44+05:30 IST
పట్టణంలోని హనుమాన్వీధిలో పతంగ్రావు అ నే బంగారు షాపు వ్యాపారి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బుధవా రం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు.
బంగారు, వెండి, నగదు అపహరణ
ధర్మపురి, జూలై 2: పట్టణంలోని హనుమాన్వీధిలో పతంగ్రావు అ నే బంగారు షాపు వ్యాపారి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బుధవా రం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. బాధితుడి బందువుల కథనం ప్రకా రం.. పతంగ్రావు 20 రోజుల క్రితం ఇంటికి తాళాలు వేసి కుటుంబ స భ్యులతో కలిసి మహారాష్ట్రలోని స్వగ్రామానికి వెళ్లాడు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పతంగ్రావు ఇంటి తాళాలు పగులగొట్టి ఇం ట్లోకి ప్రవేశించారు.
ఇంట్లోని బీరువా తెరిచి అందులోని 2 తులాల బం గారు చైన్లు, అరకిలో వెండి, రూ 10 వేలు నగదు అపహరించారు. ఉద యం చుట్టు పక్కల వారు గమనించి వెంటనే ఇంటి యజమానికి ఫోన్ ద్వారా విషయం తెలిపారు. ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బం ది చేరుకుని ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీమ్ సభ్యులు వేలి ముద్ర లు సేకరించారు. అపహరించిన బంగారు, వెండి, నగదు వివరాలు గు రించి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.